Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుష్క నటించిన తాజా చిత్రం 'నిశ్శబ్దం'. తెలుగుతోపాటు తమిళం, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ అవుతోంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని అనుష్క సినిమా తొలిసారి డైరెక్ట్గా ఓటీటీలో విడులవుతోంది. ఇందులో సాక్షి అనే మూగ, బదిర అమ్మాయిగా అనుష్క నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లో మూగ అమ్మాయిగా అనుష్క నటించిన తీరుకు మంచి ప్రశంసలు దక్కాయి. బుధవారం 'ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే' సందర్భంగా సాక్షిగా నటించిన అనుష్కకు సోషల్ మీడియా వేదికగా అభిమానులతోపాటు నెటిజన్లు సైతం విషెస్ తెలిపారు. తాను పోషించిన పాత్రే స్పెషల్ అనుకుంటే, ఇలాంటి స్పెషల్ డే రోజు.. స్పెషల్ విషెస్ అందుకుంటానని తాను ఊహించలేదని, సాక్షి పాత్ర అందరినీ తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకం ఉందని కథానాయిక అనుష్క ట్వీట్లో పేర్కొన్నారు.