Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రంగ్ దే'. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల విరామం అనంతరం ఈ సినిమా చిత్రీకరణ బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది.
'కోవిడ్-19కి సంబంధించి పూర్తి జాగ్రత్తలు పాటిస్తూ నితిన్తో పాటు ఇతర ప్రధాన తారాగణం చిత్రీకరణలో పాల్గొంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, పాటల చిత్రీకరణతో మరికొన్ని రోజులలోనే సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుంది.ప్రేమ నేపథ్యంలో ఉన్న కుటుంబ కథా చిత్రమిది. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కూర్పు: నవీన్ నూలి, కళ: అవినాష్ కొల్లా, అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం (వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత:సూర్యదేవర నాగవంశీ, రచన - దర్శకత్వం: వెంకీ అట్లూరి.