Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయకుడు ప్రభాస్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఆది పురుష్'. 'తానాజీ' దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో త్రీడీ ఫార్మెట్లో ఈ సినిమా తెరకెక్కనుంది. రామాయణం ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ఫస్ట్లుక్ పోస్టర్స్తో చెప్పారు. అలాగే ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, ప్రతి నాయకుడు రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నట్టు కూడా ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. అలాగే ఇందులో సీతగా కైరా అద్వాని నటించనుందనే వార్తలూ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఈ సినిమా నేపథ్యం పురాణగాథ రామాయణంతో ఉండదని, అలాగే అప్పటి నేపథ్యాని ప్రతిబింబిస్తూ కథ కూడా ఉండదని, దీంతోపాటు తెరపై పాత్రలు కనిపించే తీరు అప్పటి మాదిరిగా ఉండదనే వార్తలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. రాముడు, సీత, రావణడు.. కేవలం రామాయణంలోని ఈ మూడు పాత్రల స్ఫూర్తితోనే 'ఆదిపురుష్' పాత్రలు ఉంటాయని వినిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అలనాటి రామాయణాన్ని ఆధునిక రామాయణంగా చూపించబోతున్నారన్నమాట. మరి ఇది నిజమో కాదో చిత్ర బృందం అధికారికంగా స్పందించాలి.