Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లోకి 'ఫిలిమ్' పేరుతో మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ రోబోతోంది. 'ఫిలిమ్' ఓటీటీరాకతో తెలుగు ప్రేక్షకులకు మరింత వినోదం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 'ఆహా' ఓటీటీ వీక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు కొత్తగా రాబోయే 'ఫిలిమ్' సినీ వినోదాన్ని రెట్టింపు చేయబోతోంది. 'ఫిలిమ్' ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్లు, ఇండిపెండెంట్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. 'ఆహా'తో పోల్చితే 'ఫిలిమ్' ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఛార్జీలు తక్కువగా ఉండనున్నాయి. కొంతమంది యువ వ్యాపారవేత్తలు కలిసి 'ఫిలిమ్' ఓటీటీని విజయదశమి పండగ సందర్భంగా లాంచ్ చేయబోతున్నారు. 'ఫిలిమ్' ఓటీటీలో విజయ్ సేతుపతి నటించిన 'పిజ్జా 2', మమ్ముట్టి నటించిన 'రంగూన్ రౌడీ', ప్రియమణి 'విస్మయ' వంటి అనేక చిత్రాలు ప్రీమియర్ కానున్నాయి. ఈ ఓటీటీలో విజయ్ సేతుపతి 'పిజ్జా 2' తొలి చిత్రంగా ప్రీమియర్ కానుంది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఫిలిమ్ లో ప్రేక్షకులకు మంచి అనుభూతినివ్వనుంది. ఈ ఓటీటీలో రిలీజ్ కాబోయే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు, వాటి విడుదల తేదీలు, పాటలు, టీజర్, ట్రైలర్స్ అన్నీ 'ఫిలిమ్' యూట్యూబ్ ఛానెల్లో అందుబాటులో ఉంటాయి.