Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళా ప్రధాన సినిమాలకు కేరాఫ్ గా నిలుస్తూ అగ్ర హీరోలకు దీటుగా తానేమిటో నిరూపించుకున్నారు అగ్ర కథానాయిక అనుష్క. ఆమె లేటెస్ట్గా నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మంగళవారం జూమ్ ద్వారా అనుష్క మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు..
'నిశ్శబ్దం' సినిమా ఎలా మొదలైంది?
- 'భాగమతి' తర్వాత కావాలని కొంత గ్యాప్ తీసుకున్నా. ఆ సమయంలో దర్శకుడు హేమంత్తో కోనవెంకట్ ఈ స్టోరీ నెరేషన్ ఇప్పించారు. ఇందులో నా క్యారెక్టర్ ఢిపరెంట్గా ఉండటంతో పాటు సినిమా కూడా వర్క్ అవుట్ అవుతుందని నాకు బలంగా అనిపించింది. అందుకే ఈ ప్రాజెక్ట్లో నటించడానికి అంగీకరించాను. అనుకోకుండా నా దగ్గరకు వచ్చిన స్టోరీ ఇది. అలాగే అనుకోకుండానే నచ్చేసింది.
ఈ సినిమా కోసం సైన్ లాగ్వేంజ్ నేర్చుకున్నారట నిజమేనా?
- అవును, నా క్యారెక్టర్ డంబ్ అండ్ డెఫ్గా ఉంటుందని ముందుగానే డైరెక్టర్ హేమంత్ చెప్పారు. నన్ను ఈ సినిమాలోకి వచ్చేలా చేసింది కూడా నా క్యారెక్టర్కి ఉన్న ఈ స్పెషాలిటియే. ఇందుకోసం నేను కొన్నాళ్లు పాటు ఇండియన్ సైన్ లాగ్వెంజ్ నేర్చుకున్నా. అయితే చిత్రీకరణ కోసం అమెరికా వెళ్లాక అక్కడ సైన్ లాంగ్వేజ్ వేరుగా ఉంటుందని తెలిసింది. అంతర్జాతీయంగా అందరూ ఎక్కువగా వాడే సైన్ లాంగ్వేజ్ కూడా అదే కావడంతో, మళ్లీ అమెరికాలో ఓ 14 ఏళ్ల అమ్మాయి దగ్గర ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్లో ట్రైనింగ్ తీసుకుని నటించాను. ఈ సినిమా కోసం సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది.
తొలిసారి మీ సినిమా ఓటీటీ రిలీజ్ ని ఎలా ఫీలవుతున్నారు?
- ఓటిటి, థియేటర్ రెండు వేరు వేరుగా ఉన్నప్పటికీ ఓటీిటీిలో సినిమాలు విడుదల చేయడాన్ని కూడా అంతా పాజిటివ్గా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా సినిమా ఇండిస్టీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లాలంటే, టెక్నాలజీ పరంగా ఆడియెన్స్కి వినోదం ఇవ్వడంలో ఇలాంటి మార్పులు రావడం అవసరం. వాటిని అందరూ సంపూర్ణంగా స్వాగతించడం కూడా చాలా ముఖ్యం. ఇక తొలిసారిగా నేను నటించిన సినిమా ఓటీటీలో విడుదలవ్వడం నాకూ కొత్తగా అనిపిస్తోంది. అలానే మేము చేసిన ఈ కొత్త ప్రయత్నాన్ని ఆడియెన్స్ అంతా స్వాగతిస్తారని ఆశిస్తున్నాను. థియేటర్ మ్యాజికల్గా ఎక్స్పీరియన్స్ని మిస్ అవుతున్నామనే బాధ ఉంది.
మాధవన్, మైఖేల్ మ్యాడ్సన్ తో నటించడం గురించి?
- నా కెరీర్ తొలినాళ్ళలో మాధవన్తో కలిసి నటించాను. మళ్లీ ఇంత కాలం తర్వాత ఆయనతో కలిసి నటించడం చాలా వండర్ఫుల్గా అనిపించింది. ఈ సినిమాలో మేమిద్దరం ఛాలెంజింగ్ రోల్స్ చేశాం. మైఖేల్ మ్యాడ్సన్ వంటి హాలీవుడ్ లెజెండ్తో యాక్ట్ చెయ్యడం. చిత్రీకరణ టైమ్లో ఆయన చెప్పిన విషయాలు, అనుభవాలు.. వంటి వాటితో జర్నీ సూపర్గా అనిపించింది. అలానే సినిమాలో ఉన్న ఇతర పాత్రలకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ కథ కేవలం మా ఇద్దరి చుట్టూనే తిరుగుతూ ఉండదు. స్క్రీప్ ప్లేని ముందుకు నడిపించడంలో మిగతా పాత్రలు కూడా కీలకంగా మారుతుంటాయి. ఈ థ్రిల్లింగ్ రైడ్ని ఆడియెన్స్ ఎంజారు చేస్తారని కచ్చితంగా చెప్పగలను.
సంగీతానిది ఎలాంటి పాత్ర?
- ఓటీటీిలో విడుదల అవ్వడంలో ఉన్న ఒకే ఒక డ్రా బ్యాక్ ఇదే. థియేటర్స్లో ఉండే సౌండ్ సిస్టమ్, ఆడియో క్వాలిటీని ఆడియెన్స్ మిస్ అవుతారు. అయితే హెడ్ ఫోన్స్, హౌమ్ థియేటర్స్ ఈ లోపాన్ని దాదాపుగా కవర్ చేస్తాయి. ఇక ఈ సినిమాకి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్లు పెద్ద ఎస్సెట్స్. ముఖ్యంగా సంగీత దర్శకుడు గోపీ సుందర్ ఇచ్చిన రీ-రికార్డింగ్ సినిమాను ఎంతో ఆసక్తికరంగా మార్చేసింది.
ఈ సినిమా దర్శక, నిర్మాతలు గురించి?
- దర్శకుడు హేమంత్ ఫుల్ క్లారిటీతో వర్క్ చేస్తారు. తనకు ఏం కావాలన్నది నటీనటుల దగ్గర్నుంచి తీసుకోవడం హేమంత్ స్పెషాలిటీ. ఇక నిర్మాతలు కోన ఫిల్మ్ కార్పోరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్పెరిమెంటల్ స్టోరీని అమెరికా బ్యాక్డ్రాప్లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించడం అంత సులువు కాదు. దానికి చాలా ప్యాషన్, అలానే ధైర్యమూ కావాలి. ఆ రెండు ఉన్న నిర్మాతలు వీరిద్దరు.
ప్రభాస్ 'ఆదిపురుష్'లో సీతగా నటిస్తున్నారా?
- లేదు. అలాంటి ప్రస్తావనగాని, ప్రపోజల్గాని నా దగ్గరకు రాలేదు.
లాక్డౌన్లో ఏం నేర్చుకున్నారు?
- నాకు నేను ఏం మిస్ అయ్యానో తెలుసుకున్నా. చాలా సినిమాలు చూశా. ఎన్నో స్క్రిప్ట్లు చదివాను. అలాగే రెండు కొత్త ప్రాజెక్ట్లకు గ్రీన్సిగల్ ఇచ్చా.
15 ఏళ్ళ కెరీర్ గురించి ఏం చెబుతారు?
- సూపర్ దగ్గర్నుంచి నిశ్శబ్దం వరకు.. ఈ 15 ఏళ్ళ జర్నీని చాలా లక్కీగా ఫీలవుతున్నాను. 'అరుంధతి' తర్వాత నా కెరీర్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. అయితే అభిమానుల అభిమానం, ప్రేమ, దర్శక, నిర్మాతల సహకారం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను.