Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు శశి ప్రీతమ్ సోమవారం 'డెక్కన్ మ్యూజిక్ ఛాలెంజ్' పేరుతో ఓ కాంపిటీషన్ ప్రారంభించారు. దీనికి ఆయన కుమార్తె ఐశ్వర్య కృష్ణ ప్రియ నిర్మాత. దీని గురించి శశి ప్రీతమ్ మాట్లాడుతూ, 'మన దగ్గర చాలా మంది సంగీత కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రజలకు తెలియదు. గత ఐదేళ్ళుగా రాక్ బ్యాండ్ సంస్కతి హైదరాబాద్లో పెరిగింది. ప్రామిసింగ్ సింగర్స్, మ్యుజీషియన్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ ఛాలెంజ్ని ప్రారంభించాం. ప్రతి వారం ఓ రాక్ బ్యాండ్, సోలో సింగర్ పర్ఫార్మ్ చేస్తారు. పన్నెండు వారాల తర్వాత న్యాయ నిర్ణేతలు విజేతను ఎంపిక చేస్తారు. ఫైనల్స్ను గ్రాండ్గా నిర్వహిస్తాం. ప్రతి బ్యాండ్ ప్రయాణం, స్ట్రగుల్స్ తెలిసేలా నా యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేయబోతున్నా. ఇది తొలి సీజన్, రెండో సీజన్కీ సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.
'మా నాన్నగారు ఎప్పుడూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తారు. ఈ ఛాలెంజ్ ద్వారా కొత్త టాలెంట్ వెలుగులోకి వస్తుంది. నేను మ్యూజిక్ థెరపిస్ట్ని కూడా. సంగీతానికి ఉన్న శక్తి నాకు తెలుసు. రాక్ బ్యాండ్స్, సింగర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్' అని శశి ప్రీతమ్ కుమార్తె ఐశ్వర్య కృష్ణ ప్రియ తెలిపారు.