Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందు విజయ్ కష్ణ, రష్మీ గౌతమ్ జంటగా నటిస్తున్న చిత్రం 'బొమ్మ బ్లాక్బస్టర్'. నూతన దర్శకుడు రాజ్ విరాట్ డైరెక్షన్లో జయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్, ఆ తరువాత విడుదల చేసిన టీజర్తో అటు ఆడియెన్స్లోను, ఇటు ఇండిస్టీ వర్గాల్లోనూ అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ చిత్రం ఆడియో ఆల్బమ్ నుంచి 'రాయే నువ్వు రాయే' అనే పాటను కథానాయకుడు వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ పాటకు విశేష స్పందన లభిస్తోంది.
ఈ సినిమాలో నందు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఫ్యాన్గా నటిస్తున్నారు. నందు పోషించిన పోతురాజు పాత్ర వైవిధ్యంగా ఉండబోతుందని, నందు పాత్రకు దీటుగా రష్మీ గౌతమ్ పాత్ర కూడా ఉంటుందని చిత్ర బందం తెలిపింది.
ఈ సినిమా చిత్రీకరణతో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందని, ఇప్పుడొస్తున్న సినిమాలకు ఈ సినిమా భిన్నంగా ఉంటుందని చిత్ర నిర్మాతలు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు. లహరి మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో అందుబాటులో ఉంది.
నందు విజయ్ కష్ణ, రష్మీ గౌతమ్ జంటగా నటిస్తున్న ఈచిత్రానికి ఎడిటర్ : బి. సుభాష్కర్, సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్, మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి, రచన- దర్శకత్వం : రాజ్ విరాట్.