Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, సిద్ధార్థ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'మహాసముద్రం'. అజరు భూపతి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. 'ఇద్దరు హీరోయిన్లు ఉండే ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల కోసం సరైన నటులను ఎంపిక చేస్తూ వస్తున్నారు దర్శకుడు అజరు భూపతి. కథకు కీలకమైన ఒక హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఇప్పటికే టాలెంటెడ్ యాక్ట్రెస్ అదితి రావ్ హైదరిని ఎంపిక చేశారు. లేటెస్ట్గా అందాల తార అను ఇమ్మాన్యుయేల్ను మరో హీరోయిన్గా ఎంపిక చేశారు. ఆమెది కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రే. ఇంటెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని ఎ.కె. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.