Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానా దగ్గుబాటి లేటెస్ట్ గా నటించిన బహు భాషా చిత్రం 'అరణ్య'. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవనున్నది. మంగళవారం ఆవిష్కరించిన నూతన పోస్టర్, మోషన్ వీడియో ద్వారా ఈ సినిమా 2021 సంక్రాంతికి విడుదలవుతుందని చిత్ర బందం ప్రకటించింది. ఈ పోస్టర్లో ఒక వైపు ఒక విరిగిన గోడ, రానా, విష్ణు విశాల్ కనిపిస్తుండగా, మరోవైపు ఏనుగులు కనిపిస్తున్నాయి. వక్షాలను, అడవులను సంరక్షించమనే మెసేజ్ను ఈ పోస్టర్ ద్వారా ఇవ్వడం విశేషం. 'ప్రాణాంతక మహమ్మారిపై పోరాడుతున్న మనం, స్ఫూర్తి కోసం మన అడవులపై దష్టి సారించాలి. అటవీ నిర్మూలన, పారిశ్రామికీకరణ అని విస్తరిస్తున్న మహమ్మారితో భూమికి ఊపిరితిత్తుల్లాంటివి మన అరణ్యాలు సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నాయి. వచ్చే సంక్రాంతికి మీ సమీపంలోని థియేటర్కు వస్తున్న 'అరణ్య'తో వాటిని కాపాడదాం' అని చిత్ర యూనిట్ పేర్కొంది. 25 సంవత్సరాలుగా అరణ్యంలో జీవిస్తున్న ఒక మనిషి కథ 'అరణ్య'. ఈ చిత్రం పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభంపై దష్టి పెడుతోంది. ఇందులో జోయా హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ మరో రెండు కీలక పాత్రలు పోషించారు. శంతను మొయిత్రా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు.