Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ స్థాయిలో మరోసారి తెలుగు సినిమా తన సత్తా చాటింది. దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకం భావించే ఇండియన్ పనోరమ పురస్కారాన్ని 'ఎఫ్2' చిత్రం సొంతం చేసుకుంది. వెంకటేష్, వరుణ్తేజ్, తమన్నా, మెహరీన్ నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఇండియన్ పనోరమ పురస్కారం లభించిన నేపథ్యంలో 'ఎఫ్2' చిత్ర బృందం ఆనందాన్ని వ్యక్తం చేసింది. '2019 సంక్రాంతి సినిమాల బరిలో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఎఫ్ 2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). కమర్షియల్ ఎంటర్టైనర్స్తో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు అనీల్ రావిపూడికి, ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. 2019 ఏడాదికిగానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు కేంద్ర సమాచార ప్రసారశాఖ అవార్డులను ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేయగా, ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన 'ఎఫ్ 2' సినిమాతో పాటు డైరెక్టర్ అనీల్ రావిపూడి ఇండియన్ పనోరమ అవార్డ్ అందుకోనున్నారు. 2019 సంవత్సరానికి ఇండియన్ పనోరమను దక్కించుకున్న ఏకైక తెలుగు చిత్రం కూడా 'ఎఫ్2'నే కావడం విశేషం. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) వేడుకలు జనవరి 16 నుంచి 24 వరకు గోవాలో జరగనున్నాయి. ఈ వేడుకలో విజేతలకు పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది.