Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రేణు దేశాయ్ ప్రధాన పాత్రధారిణిగా రూపొందుతున్న వెబ్ సిరీస్ 'ఆద్య'. డి.ఎస్.కె.స్క్రీన్-సాయికష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై డి.ఎస్.రావు, రజనీకాంత్. ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం.ఆర్.కష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యు అండ్ ఐ పద్మనాభరెడ్డి సమర్పిస్తున్న ఈ వెబ్ సిరీస్లో నందిని రాయ్ తోపాటు బాలీవుడ్ హీరో వైభవ్ తత్వవాడి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ 'ఆద్య' వెబ్ సిరీస్ విజయదశమి రోజు ఆరంభమైంది. సంస్థ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలు అనంతరం స్క్రిప్ట్ను ప్రముఖ పారిశ్రామికవేత్త చింతిరెడ్డి అనంత్రెడ్డి దర్శకుడు కృష్ణకు అందించారు. రేణుదేశాయ్ పై చిత్రీకరించిన ముహూరపు సన్నివేశానికి దర్శకులు నీలకంఠ కెమెరా స్విచాన్ చేయగా, డి.ఎస్.రావు క్లాప్ కొట్టారు. ఎం.ఆర్.కష్ణ మామిడాల దర్శకత్వం వహించారు. మహిళా ప్రధాన పాత్రలో రేణుదేశాయ్ రీ-ఎంట్రీ ఇస్తున్న 'ఆద్య' జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్మాతలు తెలిపారు. రేణుదేశాయ్ మాట్లాడుతూ, 'దర్శకుడు కృష్ణ చెప్పిన కథ విపరీతంగా ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేంత గొప్ప కథ' అని అన్నారు. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, తన కథను ఓకే చేసి, ప్రోత్సహిస్తున్న రేణుదేశాయ్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానని దర్శకుడు అన్నారు. రేణు దేశారుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గర్వంగా ఉందని నందిని రాయ్ అన్నారు.