Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల కుటుంబం నుంచి మరో వారసుడు చిత్రరంగంలోకి అడుగిడుతున్నారు. వాళ్ళ మనవడు శరణ్ 'ది లైట్' కుమార్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా విజయదశమి సందర్భంగా సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మాన్విత, కుశల కుమార్ బులేమని సమర్పణలో సినీటేరియా మీడియా వర్క్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ఈ సినిమా ద్వారా రామచంద్ర వట్టికూటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలత బి.వెంకట్, వెంకట్ బులేమని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హీరో శరణ్, నటుడు 'జెమినీ' సురేష్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. యువ హీరోలు సుధీర్ బాబు, నవీన్ విజయకష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, నరేష్ క్లాప్ ఇచ్చారు. దీనికి ముందు సుధీర్ బాబు, ప్రియా సుధీర్ బాబు దంపతుల చేతుల మీదుగా స్క్రిప్ట్ పూజా కార్యక్రమాలు జరిగాయి. వాళ్ళిద్దరూ దర్శకుడు రామచంద్రకి స్క్రిప్ట్ అందజేశారు. ఈ నేపథ్యంలో విజయనిర్మల విగ్రహానికి శరణ్ పూలమాల వేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కష్ణ మాట్లాడుతూ, 'ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న, మా కుటుంబ సభ్యుడు శరణ్కి నా అభినందనలు. ఇంతకు ముందు మా కుటుంబం నుంచి వచ్చిన చాలామంది ఆర్టిస్టులను ప్రేక్షకులు ఆదరించారు. అభిమానించారు. అలాగే శరణ్ని కూడా ఆదరించి అభిమానించాలని కోరుకుంటున్నాను. నిర్మాతలకి, దర్శకులకి నా శుభాకాంక్షలు' అని అన్నారు.
హీరోగా పరిచయమవుతున్న శరణ్ మాట్లాడుతూ,'టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత కష్ణగారు, గిన్నిస్ బుక్ హౌల్డర్ విజయనిర్మలగారి బ్లెస్సింగ్స్తో హీరోగా పరిచయం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నరేష్ గారు లేకుండా ఈ రోజు ఈవెంట్ జరిగి ఉండేది కాదు. ఆయనకు, జయసుధ, సుధీర్ బాబు-ప్రియాకి, బెస్ట్ విషెస్ అందించిన నవీన్, తేజ్ అన్నలకి, నాకెంతో సపోర్ట్ చేస్తున్న మా నాన్నగారికి, నన్ను హీరోగా పరిచయం చేస్తున్న మా నిర్మాతలకి థ్యాంక్స్' అని చెప్పారు.
దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ,' నా తొలి సినిమా ప్రారంభోత్సవం అద్భుతంగా జరగడానికి నరేష్ అందించిన సహకారం మరువలేనిది. నా కథ వినగానే మరో ఆలోచన లేకుండా వెంటనే చేద్దామని ప్రోత్సహించిన మా నిర్మాత వెంకట్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. మా టీమ్ సహకారంతో ఈ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించి, ఇండిస్టీలో నాకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకుంటాననే నమ్మకం ఉంది' అని తెలిపారు. 'నవంబర్ నెలాఖరున రెగ్యులర్ చిత్రీకరణ స్టార్ట్ చేసి, జనవరిలోపు సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేస్తాం' అని నిర్మాతలు శ్రీలత, వెంకట్ చెప్పారు. యువ కథానాయకులు సాయితేజ్, సుధీర్బాబు, జయసుధ, నరేష్, జెమినీ సురేష్ తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొని శరణ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
శరణ్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో 'జెమినీ' సురేష్, జబర్దస్త్ త్రినాథ్, సైరస్ షవా ఖాన్, ఆకుల గోపాల్, డి. సతీష్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కూర్పు: లోకేష్ కుమార్ కడలి, మాటలు: డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: సురేష్ గంగుల, ఛాయాగ్రహణం: భరద్వాజ్, సంగీతం: రఘురామ్, సమర్పణ: మాన్విత, కుశల్ కుమార్ బులేమని, నిర్మాతలు: శ్రీలత బి. వెంకట్, వెంకట్ బులేమని, రచన-దర్శకత్వం: రామచంద్ర వట్టికూటి.