Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ హీరోగా చేసిన సినిమా 'రెడ్'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా 'స్రవంతి' రవికిషోర్ మాట్లాడుతూ, 'ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. 'స్రవంతి' మూవీస్లో రామ్తో చాలా మంచి సినిమాలు చేశాం. ఇదీ మరో మంచి సినిమా అవుతుంది. మణి శర్మ తొలిసారిగా మా సంస్థలో పని చేశారు. ఇదో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కమ్ లవ్ ఎంటర్టైనర్. ఆద్యంతం ఎమోషన్స్ రక్తి కట్టిస్తాయి. కేవలం క్రైమ్ ఎలిమెంట్ మాత్రమే కాదు. ఇందులో చక్కని లవ్ స్టోరి ఉంది. మదర్ సెంటిమెంట్, ఎంటర్ టైన్ మెంట్ హైలైట్గా నిలుస్తాయి' అని తెలిపారు. 'నా 18వ సినిమా 'రెడ్'. కిషోర్ దర్శకత్వంలో నాకిది మూడో సినిమా. ఫస్ట్ టైమ్ కెరీర్లో ఒక థ్రిల్లర్ చేశాను. మాస్ ఎలిమెంట్స్, క్లాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి' అని రామ్ చెప్పారు. కిషోర్ తిరుమల మాట్లాడుతూ,''స్రవంతి మూవీస్లో నేను రామ్తో చేసిన మూడో సినిమా ఇది. 'రెడ్' సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెబుతున్నా. కథ కొత్తగా ఉంటుంది. ట్రీట్మెంట్ కూడా కొత్తగా ఉంటుంది. ఇది థ్రిల్లర్ అయినప్పటికీ కమర్షియల్గా ఉంటుంది' అని చెప్పారు.