Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయి కిరణ్, వికాసిని రెడ్డి, జ్యోతిసింగ్ హీరోహీరోయిన్లుగా వెంకట్రెడ్డి నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అతడెవడు'. తోట సుబ్బారావు నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, కెమెరా స్విచాన్ చేశారు. మొదటి సన్నివేశానికి తోట నాగేశ్వరరావు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో చిత్ర నిర్మాత తోట సుబ్బారావు మాట్లాడుతూ,' ఇదొక డిఫరెంట్ క్రైమ్, సన్పెన్స్ థ్రిల్లర్. దర్శకుడు వెంకట్రెడ్డి చెప్పిన కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండటంతో తోట క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. సాయికిరణ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ మంత్రి వర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్కి నా కతజ్ఞతలు' అని అన్నారు. 'క్రైమ్ బ్యాక్ డ్రాప్లో జరిగే ఒక ఆసక్తికర లవ్స్టోరీ ఇది. ప్రస్తుతం హైదరాబాద్లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. అలాగే వైజాగ్, అరకు లోయలో సెకండ్ షెడ్యూల్ ఉంటుంది. నిర్మాత తోట సుబ్బారావు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి బడ్జెట్తో నిర్మిస్తున్నారు' అని దర్శకుడు నంది వెంకట్రెడ్డి తెలిపారు.
హీరో సాయి కిరణ్ మాట్లాడుతూ,'ఈ సినిమాలో నేను మెగాస్టార్ ఫ్యాన్గా నటిస్తున్నాను. మంచి కథతో వస్తున్న మా చిత్రాన్ని మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత తోట సుబ్బారావుకి థ్యాంక్స్' అని చెప్పారు. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కథానాయికలు వికాసిని రెడ్డి, జ్యోతిసింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: డిమ్స్ రాము, డిఓపి: డి. యాదగిరి, డైలాగ్స్: కాకుమాని సురేష్, బయ్యవరపు రవి.