Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్తో, క్వాలిటీ చిత్రాలను నిర్మించి దక్షిణాది సినీ పరిశ్రమను నెక్ట్స్ రేంజ్కు తీసుకెళ్లాలనే ఉన్నతాశయంతో విజయ్ కిరగందూర్ హౌంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థను ఆరంభించారు. కన్నడ సూపర్స్టార్స్ పునీత్ రాజ్కుమార్ తో 'నినిందలే', యష్తో 'మాస్టర్ పీస్' వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను రూపొందించి అందరి దష్టిని ఆకర్షించారు. అలాగే పునీత్ రాజ్ కుమార్ తో చేసిన 'రాజకుమార' చిత్రం హయ్యస్ట్ గ్రాసర్గా నిలిచి శాండిల్వుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా హౌంబలే ఫిలింస్ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. రాకింగ్స్టార్ యష్తో చేసిన భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్ ప్యాన్ ఇండియా చిత్రం 'కె.జి.యఫ్ చాప్టర్1'తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి పాన్ ఇండియా నిర్మాణ సంస్థగా హౌంబలే ఫిలింస్ తన మార్క్ను క్రియేట్ చేసింది. ఇప్పడు హౌంబలే ఫిలింస్ నిర్మాణంలో రూపొందుతోన్న మరో పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రం 'కె.జి.యఫ్ చాప్టర్ 2'. ఈ సినిమా విడుదల గురించి ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా హౌంబలే ఫిలింస్ మరో పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.
ఈ సందర్భంగా ఈ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ, 'మా బ్యానర్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన 'కె.జి.యఫ్ చాప్టర్ 1' ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరో పాన్ ఇండియా చిత్రం 'కె.జి.యఫ్ చాప్టర్ 2'పై ఎలాంటి అంచనాలున్నాయో అందరికీ తెలుసు. దీన్ని అందరి అంచనాల స్థాయిలోనే రూపొందిస్తున్నాం. అలాగే ఇప్పుడు మా బ్యానర్లో మూడో పాన్ ఇండియా సినిమాను రూపొందించ నున్నాం. భారతీయ భాషలన్నింటిలో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్, అందులోని నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను ఈనెల 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాలకు తెలియజేస్తాం' అని చెప్పారు.