Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఈ రోజుల్లో' ఫేమ్ శ్రీ మంగం, శశాంక్, అవంతిక హరినల్వా, గాయత్రి అయ్యర్ హీరో హీరోయిన్లుగా కుమార్ జి. దర్శత్వంలో తెరకెక్కిన చిత్రం 'ప్రణవం'. చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్ పతాకంపై తనూజ.ఎస్ నిర్మించిన లవ్, థ్రిల్లర్ చిత్రమిది. ఈ చిత్రంలోని పాటలు ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఈ నెల 29న థియేటర్స్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ,'ఈ రోజుల్లో' చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ మంగం హీరోగా వస్తోన్న చిత్రమిది. మరో మారు హీరోగా తనేంటో నిరూపించుకునేలా ఈ సినిమా ఉంటుంది. దర్శకుడు కుమార్కి ఇది తొలి సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల ఆలోచనా విధానానికి తగ్గట్టుగా తెరకెక్కించారు. ప్రజెంట్ కొత్త కథలతో పోటీ పడి సినిమాలు చేస్తున్న దర్శకుల లిస్ట్లో మా దర్శకుడు కుమార్ కూడా చేరతారనే నమ్మకంతో ఉన్నాం. కథకి తగ్గట్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా రిచ్గా నిర్మించాం. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి. ఈ నెల 29న గ్రాండ్గా ఈ సినిమాని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు. ఈ చిత్రానికి డిఓపి: మార్గల్ డేవిడ్, కొరియోగ్రాఫర్: అజరు, సంగీతం: పద్మనావ్ భరద్వాజ్, ఎడిటర్: సంతోష్, ఫైట్స్: దేవరాజ్, కో- ప్రొడ్యూసర్స్ : వైశాలి, అనుదీప్.