Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. అల్లు అర్జున్ కెరీర్లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్గా నిలిచింది. ఈ సినిమా విడుదలై ఏడాదైన నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియాతో సమావేశమైంది.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ,'ఈ సినిమా నా కెరీర్లో ఒక మైల్స్టోన్ సినిమాగా నిలిచేందుకు కారణమైన అందరికీ ధన్యవాదాలు. త్రివిక్రమ్ టేకింగ్, తమన్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. నాన్న(అల్లు అరవింద్), చినబాబు సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. 2020 నాకు బెస్ట్ ఇయర్, ఈ సినిమా విడుదలై నాకు బూస్టప్ ఇచ్చింది. నా కెరీర్లో ఆల్ టైమ్ హిట్గా నిలిచింది. నా 20 ఏళ్ల కెరీర్లో ఈ సినిమా గుర్తుండిపోతుంది' అని అన్నారు. 'అల్లు అరవింద్ కథ విని వెంటనే చిత్రీకరణకి వెళ్లిపోండి అన్నారు. ఇప్పటికీ ఆ మాట, ఆయన కాన్ఫిడెన్స్ని మర్చిపోలేను. చినబాబు కథకు ఏం కావాలో అన్నీ సమకూర్చారు. సునీల్ ఉంటే చాలని చెప్పాను. అలాగే తమన్ ప్రాణం పెట్టి సాంగ్స్ ఇచ్చాడు. పూజా హెగ్డే ఎనర్జీ.. ఇలా అందరూ తమవంతు పూర్తి సహకారం ఇచ్చారు. ఈ సినిమా ఇంత గ్రాండ్ హిట్ అయిందంటే అల్లు అర్జున్ ప్రధాన కారణమని చెబుతాను. బన్నీ ఈ సినిమాకు ఎంత చెయ్యగలడో అంతా చేశాడు' అని దర్శకుడు త్రివిక్రమ్ తెలిపారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ,'ఒక ఏడాది తరువాత ఈ సినిమా ఫంక్షన్ ఏంటని అడిగితే, ఈ సినిమాలో అంత దమ్ము ఉంది. ఈ సినిమా త్రివిక్రమ్ మాయ, బన్నీ విశ్వరూపం, తమన్కు జస్ట్ బిగినింగ్. ఈ కోవిడ్ సమయంలో ఈ సినిమా అందరికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. త్రివిక్రమ్ రైటింగ్లో మ్యాజిక్ అందరికి నాలుగు రెట్లు ఎక్కువ ఉత్సాహన్నీ ఇచ్చింది. జెమినిలో ఈ సినిమా బెస్ట్ టిఆర్పీ 29.4 రేటింగ్ను సొంతం చేసుకుంది. థియేటర్ అనేది తల్లి లాంటిది, ఓటిటి అనేది పిల్లలతో సమానం. కలకాలం నిలిచిపోయేది థియేటర్స్ మాత్రమే'అని చెప్పారు.
పూజ హెగ్డే మాట్లాడుతూ,'బన్నీ ఎనర్జీ ఈ సినిమాకి మెయిన్ హైలెట్. ఈ సినిమా చేస్తున్నంత సేపు చాలా ఎంజారు చేశాను. త్రివిక్రమ్ గారితో చేసున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాని అన్ని ఫ్లాట్ఫామ్స్లో ఆదరించిన ఆడియన్స్కు కతజ్ఞతలు' అని అన్నారు.
ఈ సినిమాను ఆడియన్స్ ఎంకరేజ్ చేసిన విధానానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమన్, సుశాంత్, నవదీప్, సునీల్, సముద్రఖని హ్యాట్సాఫ్ తెలిపారు.