Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు సంబంధించి 39 మంది ప్రముఖ నటీనటులతోపాటు మహానటి జమున నటించిన చిత్రం 'అన్నపూర్ణమ్మ గారి మనవడు'. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నాయనమ్మగా, మాస్టర్ రవితేజ మనవడిగా టైటిల్ పాత్రలు పోషించగా, హీరో హీరోయిన్లుగా బాలాదిత్య, అర్చన నటించారు. ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై జాతీయ అవార్డు గ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. స్వచ్ఛమైన పల్లెటూరి కథతో ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న అనుబంధాలను, మానవ సంబంధాలను సమ్మిళతం చేసి తెరకెక్కించిన చిత్రమే ఇది. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ అర్చన పాత్రికేయులతో మాట్లాడుతూ,'2020 ప్రభావం మనపై బాగా చూపించింది. ఈ ఏడాది అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నా. అన్నపూర్ణమ్మ, జమున గారి సినిమాలను చిన్నప్పట్నుంచీ చూస్తూ పెరిగాను. వాళ్ల సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. కొత్త కాన్సెప్ట్తో వస్తోన్న చిత్రాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. కళాతపస్వి కె.విశ్వనాధ్ ఈ చిత్రం చాలా బాగుందని ప్రశంసించడం ఆనందంగా ఉంది. ఇందులో మెడికల్ స్టూడెంట్గా మొదలయ్యే నా పాత్ర, ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకోవడం, ప్రేమించినవాడి కోసం ఎంత దూరమైనా వెళ్లే పాత్ర చేశాను. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరువు హత్యలను కూడా ఈ చిత్రంలో చూపించారు. నటనకు ఎంతో అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషించాను. దర్శకుడు నర్రా శివానాగేశ్వరరావు చిత్రంతో పాటు నా పాత్రను అద్భుతంగా మలిచారు. నేను నటించిన అన్ని సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సినిమాతో మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకుంటున్నా. నాకిచ్చిన పాత్ర ఏదైనసరే సిన్సియర్గా చేస్తాను. 'నేను' మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన నాకు చాలా మంచి పాత్రలు వచ్చాయి. 'శ్రీరామదాసు'లోని సీత పాత్రతో మరింత పేరు వచ్చింది. ఒక పాత్రకే పరిమితమయ్యేలా చూసుకోను. నాకు డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం. స్పెషల్ సాంగ్స్ చేయడం, గ్లామర్ రోల్స్ చేయడం వల్ల ఆఫర్స్ తగ్గుతాయని నేను అనుకోను. పెళ్లి తర్వాత హ్యాపీగా ఉన్నాం. నా భర్త దష్టిలో నేనే సూపర్ స్టార్. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నాను. కెమెరామెన్ అంజి డైరెక్షన్లో ఒక ప్రాజెక్ట్కి సైన్ చేశాను. చాలా ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్నాను' అని చెప్పారు.