Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బుధవారం ఆరంభమైంది. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్.వి.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఆర్.బి. చౌదరి, ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రమిది. ఈ సినిమా బుధవారం సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ, 'ఫిబ్రవరి నుండి రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభిస్తాం. మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ ప్రతిష్ఠాత్మక స్క్రిప్ట్ను దర్శకుడు మోహన్ రాజా అద్భుతంగా సిద్ధం చేశారు. మెగాస్టార్ కెరీర్లో మరో బ్లాక్బస్టర్ సినిమాగా ఇది నిలుస్తుంది' అని అన్నారు. దర్శకుడు మోహన్రాజా మాట్లాడుతూ,'మెగాస్టార్ సినిమా చేసే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నాను. అయన అభిమానులు కోరుకునే రేంజ్లో ఈ సినిమా ఉంటుంది. మెగాస్టార్ కెరీర్లోనే మరో భిన్నమైన సినిమా అవుతుంది. ఇది పూర్తిస్థాయి రీమేక్ సినిమా కాదు. 'లూసీఫర్' కథను తీసుకుని మెగాస్టార్ ఇమేజ్కి తగ్గట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నాం. మిగతా నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం : ఎస్.ఎస్.తమన్, కెమెరా : నీరవ్ షా, రచయిత : లక్ష్మి భూపాల్, ఆర్ట్ : సురేష్ సెల్వరాజన్, లైన్ ప్రొడ్యూసర్ : వాకాడ అప్పారావు, నిర్మాతలు : ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్, స్క్రీన్ ప్లే - దర్శకత్వం : మోహన్ రాజా.