Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కరాబు మైండు కరాబు మెరిసే కరాబు నిలబడి చూస్తావా రుబాబు..' అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన 'పొగరు' సినిమాలోని సాంగ్ యూట్యూబ్లో మిలియన్స్ వ్యూస్తో విశేషాదరణ పొందింది. ఈ సాంగ్ పెద్ద హిట్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులంతా ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ వల్ల డిస్ట్రిబ్యూటర్స్ కూడా రిలీజ్ డేట్ చెప్పండంటూ ఫోర్స్ చేస్తున్నారు. ఈ ఎగ్జైట్మెంట్కి పుల్స్టాప్ పెడుతూ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ధవ సర్జా హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఇంతటి క్రేజి చిత్రాన్ని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సియర్, నిర్మాత డి.ప్రతాప్ రాజు తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో సాయిసూర్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆయన విడుదల చేస్తున్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,'నా కెరీర్లో కేవలం ఒక్క సాంగ్తో యూట్యూబ్, టివి ఛానల్స్లో రికార్డ్ వ్యూస్ని సొంతం చేసుకుని, ట్రెండింగ్తో ఇంత క్రేజ్ తెచ్చుకున్న చిత్రాన్ని చూడలేదు. అటువంటి ఈ సినిమా తెలుగు హక్కులను మా సాయిసూర్య ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలకి సన్నాహలు చేస్తున్నామని కన్నడ నిర్మాతలు తెలిపారు. అయితే ఈ సినిమా క్రేజ్ వల్ల అటు సోషల్ మీడియాలో, ఇటు ఫోన్స్ ద్వారా అభిమానులు వరుస కాల్స్లో రిలీజ్ డేట్ చెప్పమనటం చాలా క్రేజీగా అనిపించింది. దీంతో ఈ సినిమాని ఫిబ్రవరి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నాం. కన్నడ టైటిల్ 'పొగరు'. తెలుగులోనూ అదే టైటిల్తో వస్తున్నాం. వరుసగా మూడు సూపర్హిట్స్తో డబుల్ హ్యట్రిక్కి శ్రీకారం చుడుతూ కన్నడలో దూసుకుపోతున్న ధవ సర్జా, టాలీవుడ్లో ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా సూపర్హిట్ అంటూ స్టాంప్ వేసుకున్న కథానాయిక రష్మిక మందన్నా జంటగా నటిస్తున్నారు. వీరిద్దరి మద్య వచ్చిన 'కరాబు సాంగ్..' విజువల్గా అందర్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. రిపీట్గా చూస్తున్నారంటే ఈ చిత్రంపై క్రేజ్ ఏ రేంజ్లో ఉందో తెలుస్తుంది. తరువాత వచ్చే సాంగ్స్, ట్రైలర్ ఇంతకి మించి ఉంటాయి. దర్శకుడు నందన్ కిషోర్ ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా తెరకెక్కించారు. మ్యూజిక్ దర్శకులు చందన్ శెట్టి, అర్జున్ జన్య ఇచ్చిన ప్రతి సాంగ్ సంచలనం కాబోతుంది. ఈ చిత్రంలో డబ్ల్యూడబ్ల్యూలో ఫేమస్ ఫైటర్స్ కారు గ్రీనే, మోర్గన్ అస్తే, జో లిండర్, జాన్ లోకస్ ఈ చిత్రంలో విలన్స్గా నటిండం విశేషం. ఈ ఇద్దరి బాడి బిల్డర్స్కి, ధృవ సర్జాకి మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు సంబ్రమాశ్చర్యపరుస్తాయి. ఇలాంటి చాలా సర్ప్రైజ్లు ఈ చిత్రంలో డైరక్టర్ క్రియేట్ చేశారు. జనవరి నెలాఖరు నుండి ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని సర్ప్రైజ్లు ప్రేక్షకులకు అందిస్తాం' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : చందన్ శెట్టి, అర్జున్ జన్య, నిర్మాత : డి. ప్రతాప్ రాజు, దర్శకుడు :నందన్ కిషోర్.