Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రం 'శ్రీకారం'. కిశోర్ బి. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు శనివారం చిత్ర బందం ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ని విడుదల చేశారు.
'ఇప్పటివరకూ చేయని విభిన్న తరహా పాత్రలో, గ్రామీణ నేపథ్యంలో నడిచే కథలో శర్వానంద్ అలరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన 'భలేగుంది బాలా', 'సందళ్లె సందళ్లే సంక్రాంతి సందళ్లే..' పాటలు సంగీత ప్రియులను బాగా అలరిస్తున్నాయి. యూట్యూబ్లో వీటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే స్పెషల్ టీజర్కి సైతం వచ్చిన స్పందన అపూర్వం. 'గద్దలకొండ గణేష్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నుంచి వస్తున్న రెండో చిత్రమిది. 'గద్దలకొండ గణేష్'కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికీ చక్కని బాణీలు అందిస్తున్నారని ఇప్పటికే విడుదలైన పాటలు రుజువు చేస్తున్నాయి. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్, జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు కానున్నాయి' అని చిత్ర బృందం తెలిపింది.
శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్, రావు రమేష్, ఆమని, నరేష్, సాయికుమార్, మురళీ శర్మ, సత్య, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట, దర్శకుడు: కిశోర్ బి.