Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్ చంద్ర హీరోగా అరవింద్ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కనుంది. శర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి వ్యాపారవేత్త, తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన జవ్వాజి రామాంజనేయులు వ్యవహరిస్తున్నారు. ఈ నెలలోనే గ్రాండ్ ఓపెనింగ్ జరిపి, ఫిబ్రవరి నుండి రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించనున్నారు. జిబ్రాన్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి పి.జి ముత్తయ్య సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. సిద్దార్ధ్ ఎడిటింగ్ భాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అచ్యుత్ కుమార్, స్మిర్తి వెంకట్, ఎమ్.గోపి, పూజా రామచంద్రన్, సత్యం రాజేష్, సిరి, నవీనా రెడ్డి, సుదర్శన్, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 'రెగ్యులర్గా వస్తున్న క్రైమ్ థ్రిల్లర్స్కి భిన్నంగా, వినూత్నంగా ఈ సినిమా ఉంటుంది. నవీన్ చంద్ర పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది' అని నిర్మాత జవ్వాజి రామాంజనేయులు తెలిపారు.