Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి వంటి క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ సోమవారం ఆరంభమైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12గా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్కళ్యాణ్ పాల్గొనగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను దర్శకుడు సాగర్.కె.చంద్ర ఆరంభించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలను అగ్ర దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తున్నారు. చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం గురించి నిర్మాత సూర్య దేవర నాగవంశీ మాట్లాడుతూ,'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి పాల్గొనగా పదిరోజులపాటు హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుతాం. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాం. మా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సముద్ర ఖని, మురళీ శర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఇప్పటివరకు ఎంపికైన తారాగణం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్.ఎస్, ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రాహకునిగా, ఎడిటర్గా నవీన్ నూలి, కళా దర్శకునిగా ఏ.ఎస్.ప్రకాష్ వంటి హేమాహేమీలు ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక విభాగంలో పని చేస్తున్నారు. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరనే వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియజేస్తాం' అని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. ఈ చిత్రానికి పి.డి.వి.ప్రసాద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.