Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''30 రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్రాన్ని 'మనం' సినిమాతో పోల్చలేను. ఎందుకంటే 'మనం' సినిమా రిలీజైనప్పుడు సోషల్ మీడియా ఇంతగా పాపులర్ కాలేదు. నా కెరీర్లో ఎప్పటికీ 'మనం' చిత్రానికి ఓ సముచిత స్థానం ఉంటుంది. అలాగే ఈ సినిమాలోని పాటలకి వచ్చిన టెర్రిఫిక్ రెస్పాన్స్ చాలా బూస్టప్ ఇచ్చింది' అని అంటున్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. యాంకర్ ప్రదీప్, అమృతా అయ్యర్ నాయకానాయికలుగా మున్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'. పలు తెలుగు, కన్నడ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఎస్.వి.బాబు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని సోమవారం ఈ చిత్ర సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే, 'ఈ సినిమాలోని పాటలు ఇంతగా జనాదరణ పొందడానికి కారణం ఒక్కటే దర్శకుడు. ఆయన చెప్పిన కథ, పాటలు వచ్చే సందర్భం. ఇవన్ని పక్కా యాప్ట్గా పాటలకు సెట్ అయ్యాయి. వినటానికే కాకుండా విజువల్గానూ ఈ పాటలు ఇంత బాగా వచ్చాయంటే అందుకు మరో కారణం మా నిర్మాత ఎస్.వి.బాబుగారు. ఆయన రాజీపడని తనమే ఈ ఆడియో ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి మెయిన్ పిల్లర్గా నిలిచింది. కథ వినగానే 'నీలి నీలి ఆకాశం' పాటకు ట్యూన్ చేసి, చంద్రబోస్గారికి ఇచ్చాను. ఆయన ఈపాటకు అత్యద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. నాలుగు పాటలను ఆయన రాశారు. అనంతశ్రీరామ్ 'అమ్మ' మీద ఓ పాట రాశారు. ఈ పాట నా మనసుకి చాలా నచ్చింది. మరొక పాటను నేను, ప్రదీప్ కలిసి రాశాం. ఆ పాటను సర్ప్రైజింగ్గా రిలీజ్ చేస్తాం. ప్రదీప్ హీరోగా నటిస్తే నాతోనే మ్యూజిక్ చేయించుకోవాలనే ఆశతోపాటు కథ బాగా నచ్చడంతో ఈ సినిమాకి గ్రీన్ సిగల్ ఇచ్చాను. ప్రదీప్ నుంచి ఆశించే అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉంటాయి.