Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులను చూసి, ప్రజల కష్టాలను తీర్చిన ఒక ఉద్యమ ధీరుడి జీవిత చరిత్ర కథాంశంగా రూపొందిన చిత్రం 'తెలంగాణ దేవుడు'' అని దర్శకుడు వడత్యా హరీష్ తెలిపారు. శ్రీకాంత్, సంగీత, జిషాన్ ఉస్మాన్(తొలి పరిచయం), బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, మధుమితతో పాటు 50 మంది అగ్ర తారాగణంతో తెరకెక్కిన చిత్రమిది. మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దిగ్విజయంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని, గుమ్మడికాయ కార్యక్రమం జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ రామానాయుడు స్టూడియోలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు వడత్యా హరీష్ మాట్లాడుతూ,'ఈ చిత్రాన్ని ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ జోడించి, మంచి పాటలతో అన్ని రంగాల వారికి నచ్చే విధంగా రూపొందించాం. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత మహ్మద్ జాకీర్ ఉస్మాన్కి కతజ్ఞతలు. ఈ చిత్రాన్ని మార్చి చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు మాక్స్ల్యాబ్ సీఈవో మహ్మద్ ఇంతెహాజ్ అహ్మద్ మాట్లాడుతూ, 'ఈ చిత్రం ద్వారా మహముద్ జాకీర్ ఉస్మాన్ తనయుడు జిషాన్ ఉస్మాన్ను పరిచయం చేస్తున్నాము. కొత్తవాడైనా అద్భుతంగా నటించాడు' అని తెలిపారు. అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చిందని లైన్ ప్రొడ్యూసర్ మహ్మద్ ఖాన్ చెప్పారు. సంగీత దర్శకుడు నందన్ బొబ్బిలి మాట్లాడుతూ, 'ఇలాంటి మంచి చిత్రానికి సంగీతం అందించడం అదష్టంగా భావిస్తున్నాను' అని అన్నారు.