Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'100% లవ్', '1 నేనొక్కడినే' వంటి హిట్ చిత్రాలకు కథ-స్క్రీన్ ప్లే అందించిన డైరెక్టర్ హరిప్రసాద్ జక్కా తాజాగా 'ప్లే బ్యాక్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇండియాలోనే తొలిసారిగా క్రాస్ టైమ్ కనెక్షన్ అనే వినూత్న పాయింట్తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. 'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా, అనన్య నాగళ్ల హీరోయిన్గా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ప్రసాదరావు పెద్దినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మార్చి 5న రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సినిమా ప్రి-రిలీజ్ వేడుక ప్రసాద్ల్యాబ్స్లో సినీ ప్రముఖుల సమక్షంలో వినూత్నంగా జరిగింది. ఈ చిత్ర ఫస్ట్ టికెట్ను 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సాన కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మాట్లాడుతూ, 'ఈ సినిమా చూసి వండర్ అయ్యాను. ఇంట్రెస్టింగ్గా సాగే స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్. ఇలాంటి ఒక కొత్త ఐడియాతో సినిమా తీసిన హరిప్రసాద్ ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవుతారు' అని చెప్పారు. హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ, 'మంచి సినిమా వస్తే ఆదరిస్తామని 'హుషారు' సినిమాతో ప్రేక్షకులు ప్రూవ్ చేశారు. ఇంట్రెస్టింగ్ నావేల్టీ లవ్ స్టొరీతో ఈ సినిమా చేశాం. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని నా గట్టి నమ్మకం' అని అన్నారు. హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ, ''మల్లేశం, 'హుషారు' తర్వాత చేసిన సినిమా ఇది. కథకి ఇంపార్టెన్స్ ఇస్తూ హరిప్రసాద్ గారు ఈ సినిమా చేశారు. నాకు ఇంత మంచి క్యారెక్టర్ రావడం గర్వంగా ఫీలవుతున్నాను' అని తెలిపారు. 'స్క్రిప్ట్ రాయడానికి ఎంత కష్టపడ్డానో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి నాకు ఎంతో సపోర్ట్ చేసి అంతే కష్టపడ్డాడు. ప్రతీ ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఇంతవరకూ చూడని సినిమా ఇదని గ్యారెంటీగా చెప్పగలను. సెంటిమెంట్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ సీన్స్ అన్ని రకాల ఎమోషన్స్ ఈ చిత్రంలో ఉంటాయి' అని చిత్ర దర్శకుడు హరిప్రసాద్ జక్కా అన్నారు.
డైరెక్టర్ సుకుమార్ వీడియో బైట్ ద్వారా మాట్లాడుతూ, 'హరిప్రసాద్ నాకు మంచి మిత్రుడు, ఫిలాసఫర్. ఒక బ్రదర్ లా నన్ను గైడ్ చేసేవాడు. '100% లవ్', స1.. నేనొక్కడినే' చిత్రాలకు కథ-స్క్రీన్ ప్లే అందించాడు. గొప్ప కథతో 'ప్లే బ్యాక్' లాంటి మంచి సినిమా చేశాడు. ఇద్దరు లవర్స్ మధ్య జరిగే కన్వార్జేషన్ ఎలా వుంటుందో ఈ చిత్రంలో చూపించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా ఇది' అని చెప్పారు.