Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయితేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'రిపబ్లిక్'. పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలపై పోరాటం చేసే ఓ ఇన్టెన్సిటీ ఉన్న పాత్రను సాయితేజ్ పోషిస్తున్నారు. దేవ్ కట్ట డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్లో విలక్షణ నటి రమ్యకృష్ణ 'తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం!' అని భావించే విశాఖ వాణి అనే రాజకీయ నాయకురాలి పాత్రలో నటిస్తోంది. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ తనదైన పవర్ఫుల్ ఫెర్ఫామెన్స్తో మెప్పించనుందని మేకర్స్ తెలియజేశారు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. జె.బి.ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వరల్డ్వైడ్గా జూన్ 4న విడుదల చేస్తున్నారు. ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ప్లే: దేవ కట్ట, కిరణ్ జరుకుమార్, ఎడిటర్: కె.ఎల్.ప్రవీణ్, నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, జీస్టూడియోస్, జె.బి.ఎంటర్టైన్మెంట్స్.