Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఒరేయ్ బామ్మర్ది'. 'బిచ్చగాడు' వంటి ఘన విజయం సాధించిన చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రమేష్.పి .పిళ్లై నిర్మించారు. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ పోటాపోటీగా నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు సినిమాకి హైలైట్గా నిలుస్తాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏ.ఎన్ బాలాజీ ఈ నెలలో విడుదల చేయబోతున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ , కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్ : సాన్ లోకేష్, సినిమాటోగ్రఫీ : ప్రసన్న కుమార్, సంగీతం : సిద్ధూ కుమార్, సమర్పణ : రమేష్ పి పిళ్లై, దర్శకుడు : శశి.