Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివ కందుకూరి హీరోగా పి19 ఎంటర్టైన్ మెంట్ పతాకంపై వ్యాపారవేత్త సురేష్ రెడ్డి కొవ్వూరి ఓ సినిమా నిర్మిస్తున్నారు. పి19లో ప్రొడక్షన్ నెంబర్:1గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా చవన్ ప్రసాద్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. జూన్ నెల నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'శివ కందుకూరి పాత్ర సినిమా మెయిన్ పిల్లర్స్లో ఒకటి. పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్రలో ఆయన కనిపిస్తారు. సీతారామ్ ప్రసాద్ అందించిన వినూత్న కథకి చవన్ ప్రసాద్ న్యాయం చేయగలుగుతారని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఈ సినిమాకి 'జాతిరత్నాలు' ఫేమ్ సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, 'క్షణం', 'గూఢచారి', 'ఎవరు', 'హిట్', 'కృష్ణ అండ్ హిజ్ లీల' హిట్ సినిమాలకు ఎడిటింగ్ చేసిన గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ చేయనున్నారు. అలాగే పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. జూన్ నెల నుంచి హైదరాబాద్లో రెగ్యులర్ చిత్రీకరణ స్టార్ట్ చేస్తాం. కొడైకెనాల్లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు.