Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు నాని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'శ్యామ్ సింగ రాయ్'. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ఫస్ట్లుక్ పోస్టర్ ఆడియన్స్లో సినిమా పట్ల మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తూ అటు ఇండిస్టీలోను, ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలను భారీగా పెంచేసింది.
తాజాగా ఈ సినిమా కోసం కోల్కతాను తలపించే భారీ సెట్ను హైదరాబాద్లో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల రీ క్రియేట్ చేశారు. ఆరున్నర కోట్ల భారీ బడ్జెట్తో పది ఎకరాల్లో నిర్మించిన ఈ భారీ సెట్లో ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. హీరో నాని సహా ముఖ్యతారాగణంపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్పై ఈ సన్నివేశాలు సినీ ప్రియులకి ఒక కొత్త అనుభూతిని పంచనున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.
దర్శకుడు రాహుల్ సంకత్యాన్ ఓ యూనిక్ కాన్సెప్ట్తో 'శ్యామ్సింగ రారు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తన గత చిత్రాలకు భిన్నమైన సరికొత్త గెటప్స్లో నాని కనిపించనున్నారు.
సాయిపల్లవి, కతిశెట్టి, మడోనా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
జీస్సూసేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఈ సినిమాకి ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.