Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో అందరినీ అలరించడానికి జీ తెలుగు ఈ ఆదివారం తన ప్రియమైన అభిమానుల కోసం సాగర్ ర్ కే నాయుడు నటించిన 'షాదీ ముబారక్' సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఏప్రిల్ 25 మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనుంది. దిల్ రాజు మరియు శిరీష్ ప్రొడ్యూస్ చేయగా పద్మశ్రీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
మాధవ్ (సాగర్ ర్ కే నాయుడు) ఆస్ట్రేలియాలో నివసిస్తాడు. అతడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి, వధువును సెలక్ట్ చేసుకునే క్రమంలో హైదరాబాద్ వస్తాడు. అక్కడే ఓ మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించి తనకు ఎలాంటి అమ్మాయి కావాలో వివరాలు చెప్తాడు. ఈ క్రమంలో మ్యారేజ్ బ్యూరో ఓనర్ కూతురు అయిన తుపాకుల సత్యభామ (దృశ్య రఘునాథ్) పరిచయం అవుతుంది. తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో తానే బ్యూరో వ్యవహారాలు చూస్తున్న, ఆమె మాధవ్తో కలిసి పెళ్లి చూపులకు హాజరవుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న సత్యభామ - మాధవ్ ప్రేమలో పడతారు. మరి వారి ప్రేమ ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి పీటలు ఎక్కిందా? సత్యభామ- మాధవ్ ఒక్కటయ్యారా లేదా తెలియాలంటే షాదీ ముబారక్ చూడల్సిందే.
అసలు ఈ ప్రేమాయణం గురించి తెలుసుకోవాలంటే ఏప్రిల్ 25 మధ్యాహ్నం 12 గంటలకు తప్పక వీక్షించండి షాదీ ముబారక్ మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లలో.