Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమెడియన్ మధునందన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'గుండె కథ వింటారా'. వంశీధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మధునందన్ సరసన స్వాతిస్ట కష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి శ్రీరామనవమి శుభాకాంక్షలతో 'ఎంత బావుందో...' లిరికల్ సాంగ్ని యువ కథానాయకుడు విజరుదేవరకొండ రిలీజ్ చేసి, చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
'ఎంత బావుందో..పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా...గుప్పెడుగుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది..పైకే చెప్పనంటోంది హాయో మాయో అంతా కొత్తగా ఉంది ఐనా ఇదే బాగుంది బహుశా ఎదురుపడనంది' అంటూ సాగే ఈ సోల్ఫుల్ మెలొడీకి మసాలా కాఫీ సంగీతం సమకూర్చగా, కష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కష్ట జెకే, వరుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆలపించారు' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: వంశీధర్, నిర్మాతలు : క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప, సినిమాటోగ్రఫి: రవి వర్మన్ నీలిమేఘం, సురేష్ భార్గవ్, సంగీతం: మసాల కాఫీ, ఎడిటర్: సాయి కిరణ్ ముద్దం, యాక్షన్: 'రియల్' సతీష్, కొరియోగ్రఫి: భాను మాస్టర్, లిరిక్స్: కష్ణ చైతన్య.