Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'గని'. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణ ఆగింది. పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే చిత్రీకరణను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ, 'మా 'గని' సినిమా ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు చక్కబడగానే నెక్ట్స్ షెడ్యూల్కి సంబంధించిన చిత్రీరణను స్టార్ట్ చేస్తాం. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో సాగే చిత్రమిది. ఈ లాక్డౌన్ సమయంలోనూ వరుణ్ తేజ్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. తదుపరి చేసే షెడ్యూల్లో వరుణ్తేజ్, ఇతర ప్రధాన తారాగణంపై యాక్షన్ సన్నివేశాలు సహా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. దీని కోసం ఓ భారీ స్టేడియం సెట్ను కూడా వేశాం. అలాగే హాలీవుడ్ 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్', బాలీవుడ్లో 'సుల్తాన'్ చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఆధ్వర్యంలో ఈ షెడ్యూల్లోని యాక్షన్ పార్ట్ షూట్ చేస్తాం. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుణ్తేజ్ ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ లుక్తో బాక్సర్గా ప్రేక్షకులతోపాటు ఆయన అభిమానుల్ని అలరించబోతున్నారు. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు' అని తెలిపారు.