Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాక్ డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న 100 పేద కుటుంబాలకు నెలకి సరిపడా సరుకుల్ని అందించి కథానాయిక పూజా హెగ్డే తన ఉదారతని చాటుకుంది. పైగా వీటన్నింటిని తనే స్వయంగా ప్యాక్ చేసి అందించడం విశేషం. ఇటీవల కరోనా బారిన పడిన పూజా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, కోవిడ్ని జయించారు. పాజిటివ్ వచ్చినంత మాత్రాన భయపడకూడదని, ఆక్సీమీటర్ని ఎలా పడితే అలా వాడకూడదని ఇన్స్టా గ్రామ్ వేదికగా వీడియోలు రూపొందించి అవగాహన కల్పించారు. అలాగే భయంతో చాలా మంది చనిపోతున్నారని, ధైర్యమే సిసలైన మందు అని తెలిపారు. ఇదిలా ఉంటే, పూజా ప్రస్తుతం ప్రభాస్ సరసన 'రాధేశ్యామ్', రామ్ చరణ్కి జోడీగా 'ఆచార్య'లో నటిస్తోంది. అలాగే అఖిల్తో నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' రిలీజ్కి రెడీగా ఉంది. వీటితోపాటు బాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.