Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయికుమార్, కష్ణ ప్రియ, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అర్ధ శతాబ్దం'. రవీంద్ పుల్లె దర్శకుడు. రిషితా క్రియేషన్స్ ఎల్ఎల్పి, 24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్ పతాకాలపై చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం తెలుగు ఓటీటీ మాధ్యమం 'ఆహా'లో ఈనెల 11న విడుదలవుతోంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్ర టీజర్ మంచి స్పందన రాబట్టుకుంది.
'ఆహా' ఓటీటీలో ఎక్స్క్లూజివ్ మూవీగా రిలీజ్ అవుతున్న ఈ చిత్ర ట్రైలర్ను బుధవారం యువ కథానాయకుడు నాని విడుదల చేశారు. తెలంగాణలో కుగ్రామ మూలాల్లోని రాజకీయాలకు, కుల వ్యవస్థకు మధ్య ఉండే రా ఎమోషన్స్, ఇన్టెన్స్ యాక్షన్, రస్టిక్ రొమాన్స్ వంటి పలు అంశాల కలయికగా ఈ చిత్రం రూపొందినట్లు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. సినిమాలోని రాజకీయ అంశాలు, డ్రామా, మానవ సంబంధాలు, సంగీతం ఇవన్నీ అందర్నీ అలరిస్తున్నాయి. ట్రైలర్ను రిలీజ్ చేసిన నాని మాట్లాడుతూ, 'ఈ సినిమా ట్రైలర్ చాలా ఎంగేజింగ్గా ఉంది. సినిమా చూడాలనే ఆసక్తి పెంచింది. 'ఆహా'లో ఈనెల11న విడుదలవుతుంది. నటీనటులందరూ చక్కగా నటించారు. మంచి కాన్సెప్ట్తో రాబోతున్న ఈ చిత్ర యూనిట్కి సక్సెస్ రావాలని ఆకాంక్షిస్తున్నా' అని తెలిపారు.
'మా చిత్ర ట్రైలర్ని చూసి మా సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన కథానాయకుడు నానికి ధన్యవాదాలు. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ దగ్గర్నుంచి లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ వరకు అందర్నీ ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలా అనే క్యూరియాసిటీని రైజ్ చేసింది. ప్రియదర్శి, నందినీ రారు ప్రధాన తారాగణంగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్', దీంతో పాటు టోవినో థామస్ ప్రధాన పాత్రధారిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'కాలా' వంటి తదితర చిత్రాలు సైతం 'ఆహా'లో విడుదలవుతున్నాయి. వాటి సరసన మా సినిమా కూడా రిలీజ్ అవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదే మా సినిమా సాధించిన తొలి విజయంగా భావిస్తున్నాం. ఈ ఏడాదిలో ఇప్పటికే పలు వెబ్ షోస్, లెవన్త్ అవర్ వంటి ఒరిజినల్స్, మెయిల్, చావు కబురు చల్లగా, క్రాక్, జాంబీ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు 100% వినోదాన్ని 'ఆహా' అందించింది. నూతన ప్రతిభను, సరికొత్త కంటెంట్ను ప్రోత్సహిస్తూ రోజురోజుకి 'ఆహా' ప్రేక్షకులకు మరింత చేరువ అవుతోంది' అని చిత్ర బృందం తెలిపింది.
కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, కష్ణప్రియ, సుహాస్, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, పవిత్రా లోకేశ్, అజరు, రాజా రవీంద్ర, రామరాజు, దిల్ రమేశ్, టి.ఎన్.ఆర్, శరణ్య, నవీన రెడ్డి, అమ్మణ్ణి తదితరులు నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్: రవీంద్ర పుల్లె, నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ, సినిమాటోగ్రఫీ: వెంకట ఆర్.శాఖమూరి, సంగీతం: నోఫెల్ రాజ.