Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతోష్ శోభన్ హీరోగా సారంగ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న చిత్రానికి 'ప్రేమ్ కుమార్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంతో అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో రాశీ సింగ్ కథానాయిక. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్డౌన్ తర్వాత మిగిలిన షూటింగ్ని పూర్తి చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రాన్ని ప్రకటించడంతో పాటు టైటిల్ని ఎనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ, 'సాధారణంగా తెలుగు సినిమా పతాక సన్నివేశాల్లో హీరో వచ్చి స్పీచ్లు ఇచ్చి హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. కానీ, అదే పెళ్లి పీటలు మీద ఉన్న పెళ్లికొడుకుని మాత్రం ఎవరూ పట్టించుకోరు. అటువంటి ఓ పెళ్లికొడుకు తనకు పెళ్లి అవ్వడం లేదనే ప్రస్ట్రేషన్లో ఏం చేశాడనేది ఈ సినిమా కథ. అందర్నీ నవ్వించే చిత్రమిది' అని చెప్పారు.
నిర్మాత శివప్రసాద్ పన్నీరు మాట్లాడుతూ, 'హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. మా దర్శకుడు అభిషేక్ మహర్షి, రచయిత అనిరుధ్ కష్ణమూర్తి కలిసి ఓ సరికొత్త కథ రాశారు. కథనం ఆసక్తి కలిగిస్తూ, నవ్విస్తుంది. సంతోష్ శోభన్ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం. చిత్రీకరణ మొత్తం పూర్తి చేసిన తర్వాత, పరిస్థితిని బట్టి విడుదల తేది ప్రకటిస్తాం' అని తెలిపారు.
కష్ణచైతన్య, రుచిత సాధినేని, కష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, మధు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: గ్యారీ బీహెచ్, సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగాం, రచన: అభిషేక్ మహర్షి, అనిరుధ్ కష్ణమూర్తి, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: అనంత్ శ్రీకర్, నిర్మాత: శివప్రసాద్ పన్నీరు, దర్శకత్వం: అభిషేక్ మహర్షి.