Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'విడుదలకు ముందే మా 'ఎస్.ఆర్.కళ్యాణమండపం' చిత్రంపై సర్వత్రా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో శంకర్ పిక్చర్స్ వారు వరల్డ్ వైడ్ రైట్స్ని ఫ్యాన్సీ రేటుతో తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది' అని చిత్ర నిర్మాతలు ప్రమోద్, రాజు తెలిపారు. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నూతన దర్శకుడు శ్రీధర్ గాదే దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎస్.ఆర్.కళ్యాణమండంపం..ఇఎస్టిడి1975'. ప్రమోద్ - రాజు నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర వరల్డ్ వైడ్ రైట్స్ని ఫ్యాన్సీ ఆఫర్తో శంకర్ పిక్చర్స్ సంస్థ దక్కించుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు ప్రమోద్ - రాజు మాట్లాడుతూ,' మా సినిమా టైటిల్ని ఎనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఓ అసక్తి క్రియేట్ అయ్యింది. ఆ ఉత్కంఠని మరింత పెంచుతూ ఆ తర్వాత విడుదల చేసిన 'చుక్కల చున్ని', 'చూసాలే కళ్లార..' వంటి పాటలు యూట్యూబ్లో మిలయన్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటే విడుదల చేసిన టీజర్కి కూడా అంతటా అనూహ్య స్పందన లభించింది. దీంతో మా సినిమా టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇలాంటి తరుణంలోనే తాజాగా శంకర్ పిక్చర్స్ వారు మా చిత్రానికి సంబంధించిన వరల్డ్ వైడ్ రైట్స్ను ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నారు' అని తెలిపారు.
దర్శకుడు శ్రీధర్ గాదే మాట్లాడుతూ,'ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ని కిరణ్ అబ్బవరం అందించడం ఓ విశేషమైతే, విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ కీలక పాత్ర పోషించడం మరో విశేషం. ఆయన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని థియేటర్స్లో మాత్రమే విడుదల చేస్తామని మా నిర్మాతలు ప్రకటించారు. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.