Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ విలయతాండవానికి జీనజీవనం అస్తవ్యస్త మైంది. తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ప్రజలను కాపాడేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ఇచ్చి, తమ పెద్ద మనసు చాటుకున్నారు. ఇందులో భాగంగా తాజాగా లైకా ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత అల్లిరాజా సుభాస్కరన్ రెండు కోట్ల రూపాయలను విరాళంగా అందజేసి, తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సుభాస్కరన్ తరపున శనివారం సచివాలయంలో తమిళనాడు ముఖ్యమంత్రి తిరు ఎంకే స్టాలిన్ను లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు జీకేఎం తమిళ్ కుమరన్, నిరుతన్, గౌరవ్ కలిసి రూ.2 కోట్ల చెక్ని అందజేశారు.