Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాలుగేళ్లుగా 'మా' అసోసియేషన్ ప్రతిష్ఠ మసకబారిపోయింది అంటూ 'మా'తో ఎంతో అనుబంధం ఉన్న మిత్రుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి' అని 'మా' అధ్యక్షుడు నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాష్రాజ్ పోటీ చేస్తుండటంతోపాటు సిని'మా' బిడ్డలు పేరుతో ఆయన ప్యానెల్ని శుక్రవారం మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నాగబాబు 'మా' ప్రతిష్ట గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.
వాటిని ఖండిస్తూ తామెంతో కష్టపడ్డామని, కరోనా సమయంలోనూ తమ కార్యవర్గం ఎన్నో సేవలు చేసిందని శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నాగబాబు నాకు మంచి మిత్రుడే. 'మా' అసోసియేషన్ కోసం మేం చేసిన కార్యక్రమాల్ని నాగబాబుకి చిరంజీవి చెప్పగా ఆయన ప్రశంసించిన సందర్భం ఇంకా నాకు గుర్తు ఉంది. 2019లో పోటీ చేసి మెజారిటీతో గెలిచి, అభివద్ధి చేసి చూపించా. ప్రకాశ్రాజ్, మంచు విష్ణు ఫోన్ చేసి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నామని చెప్పారు. 'మా' రాజకీయ పార్టీ కాదు. ఎవరు వచ్చినా స్వాగతిస్తామని చెప్పాను.
ఏకగ్రీవంగా ఉండేలా ప్రయత్నం..
చిరంజీవి, కష్ణంరాజు, కష్ణ వంటి ఎంతోమంది సినీ పెద్దలు ఒక్కొక్క ఇటుక పేర్చి 'మా'ను స్థాపించారు. కష్ణంరాజుగారికి ఫోన్ చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాను. 'మా' ఒక దిగ్గజం. దీనికి వంద ఏనుగుల బలం ఉంది. 'మా'ని కూల్చడం ఎవరికీ సాధ్యం కాదు' అని ఆయన చెప్పమన్నారు. అదే ధైర్యంతో ముందుకొచ్చాం. 'మా' అసోషియేషన్లో 914 మంది జీవితకాల సభ్యులు. 29 మంది అసోసియేట్ సభ్యులు 18 మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి 728 మంది సభ్యులకు రూ.3 లక్షలతో జీవిత బీమా చేయించాం. మతిచెందిన 16 మంది సినీ ఆర్టిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షలు అందజేశాం. 314 మందికి ఆరోగ్య బీమా చేయించాం. రూ.3 వేల పించన్ను రూ.6 వేలకు పెంచాం. సభ్యత్వ రుసుము రూ.లక్ష నుంచి రూ.90 వేలకు తగ్గించాం. కొత్తగా 87మంది సభ్యులు అసోసియేషన్లో చేరారు. అసోసియేషన్పై నమ్మకం లేకపోతే ఎలా చేరతారు? జాబ్ కమిటీ ద్వారా 35 మంది వద్థ కళాకారులకు సినిమాల్లో అవకాశం కల్పించాం. కరోనా కష్టకాలంలో 'మా' అసోసియేషన్కు రూ.30 లక్షలు విరాళాలుగా అందాయి. వాటిలో రూ.10 లక్షలు జీవిత అందించారు. అందులో రూ.లక్షను సీసీసీకి పంపిచాం. అసోసియేషన్లో 20 ఏళ్లుగా సభ్యులుగా ఉన్నప్పటికీ ఎలాంటి పదవీ ఆశించలేదు. ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్థంగా ఉన్నాం. మేము పదవుల కోసం ఆశపడడం లేదు. కానీ మా పనుల్ని తక్కువగా చేసి మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నారు. మేము హింసకు లొంగేది లేదు. మేం విజన్తో వచ్చాం. డివిజన్ని కలుపుతూ పని చేయాలనుకుంటున్నాం. ఈసారి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకే ప్రయత్నిస్తున్నాం. ఎవరైనా సరే ఇకపై ఆచితూచి మాట్లాడతారని ఆశిస్తున్నాను' అని అన్నారు.
'అధ్యక్ష పదవి కోసం 'బాహుబలి'లా రాకండి.. మదర్ థెరిస్సాగా రండి. మీ అపారమైన సేవలను అందించండి. 'మా' అని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళండి. అయితే ప్రస్తుతం ఉన్న కమిటీ చేసిన, చేస్తున్న పనుల్ని తక్కువ చేసి మాట్లాడకండి. ఓ కమిటీ యాక్టీవ్గా ఉన్నప్పుడు ఆ కమిటీలోని సభ్యులు కొత్త ప్యానెల్లో ఎలా చేరతారు?, ఇది 'మా' బైలాస్కి విరుద్ధం కదా..?, ఆ కమిటీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం' అని 'మా' ఎగ్జిక్యూటివ్ మెంబర్ కరాటే కళ్యాణి చెప్పారు. గౌతంరాజు, శివబాలాజీ తదితరులు సైతం నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.