Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవకాశం దొరికితే తమ నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు నేటి తరం కథానాయికలు అమితాసక్తితో ఉన్నారు. కథ నచ్చితే ఏ తరహా పాత్రనైనా పోషించేందుకు వెనకాడ్డం లేదు. అలాగే తనతో పాటు ఎంత మంది హీరోయిన్లు నటిస్తున్నారు?, హీరో రేంజ్ చిన్నదా.. పెద్దదా? అనేవి కూడా ఆలోచించడం లేదు. వీటితోపాటు ఒకే భాషకు పరిమితం కావాలనీ కోరుకోవటం లేదు. ఈ ప్రయత్నంలో ఇప్పటికే పలువురు నాయికలు సక్సెస్ సాధించి, తమకంటూ ఓ ప్రత్యేకత ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ జాబితాలోకి కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది. లేటెస్ట్గా 'అక్టోబర్ 31.. లేడీస్ నైట్' అనే ద్విభాషా చిత్రానికి గ్రీన్సిగల్ ఇచ్చింది. ఇందులో తనతోపాటు నివేతా పేతురాజ్, రెబా మోనిక జాస్, మంజిమ మోహన్, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, విశ్వక్సేన్ కథానాయకుడిగా మెరవబోతున్నారు. కె.ఎల్.విజరు తెరకెక్కించబోయే ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకోనుంది. కంగనా రనౌత్తో దర్శకుడు విజరు రూపొందించిన పాన్ ఇండియా చిత్రం 'తలైవి' రిలీజ్కి రెడీగా ఉంది.