Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మలయాళంలో మమ్ముట్టి హీరోగా నటించిన 'మాస్టర్ పీస్'. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అజరు వాసుదేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 'గ్రేట్ శంకర్'గా శ్రీ ఎల్వీఆర్ ప్రొడక్షన్స్ పై నిర్మాత లగడపాటి శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎల్ భార్గవ్ (నాని) ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
'గ్రేట్ శంకర్' సినిమా టీజర్ను యువ హీరో ఆది సాయికుమార్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఇండియన్ సినిమాలో మమ్ముట్టి వన్ ఆఫ్ ద గ్రేట్ స్టార్. అలాంటి ఆయన నటించిన ఈ చిత్ర టీజర్ని నేను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. టీజర్ చాలా బాగుంది. నిర్మాత లగడపాటి శ్రీనివాస్కి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి' అని అన్నారు.
'మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'మాస్టర్ పీస్' సినిమాను తెలుగులో 'గ్రేట్ శంకర్' పేరుతో రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. తమిళంలో విజరు 'మాస్టర్'లా ఈ సినిమా కూడా యాక్షన్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది. ఇటీవల 'క్రాక్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన వరలక్ష్మి శరత్ కుమార్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు. అలాగే హీరోయిన్ పూనమ్ బజ్వా క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సినిమా టీజర్ని రిలీజ్ చేసి, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన హీరో ఆదికి కృతజ్ఞతలు' అని నిర్మాత లగడపాటి శ్రీనివాస్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం - దీపక్ దేవ్, సినిమాటోగ్రఫీ - వినోద్ ఇల్లంపల్లి, ఎడిటింగ్ - జాన్ కుట్టి, స్టంట్స్ - స్టంట్స్ శివ, దిలీప్ సుబ్బరాయన్, దర్శకత్వం - అజరు వాసుదేవ్.