Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇటీవల రిలీజ్ చేసిన మా చిత్ర థీమ్ సాంగ్కి అనూహ్య స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు గుహన్ తన క్రియేటివిటీతో అందర్నీ ఆకట్టుకునేలా తెరకెక్కించారు' అని ''డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల అన్నారు.
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రమిది. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి పి.రాజు దాట్ల నిర్మిస్తున్నారు.
తాజాగా విడుదలైన థీమ్సాంగ్కి విశేషాదరణ లభిస్తున్న నేపథ్యంలో నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, 'ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచాయి. తాజాగా థీమ్ సాంగ్ని రిలీజ్ చేశాం. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా అందర్నీ అలరిస్తోంది. అందులో హీరో, హీరోయిన్ భయపడుతుండగా మధ్యలో ఓ మాస్క్ ఉంది. క్రియేటివ్గా ఉన్న ఈ పోస్టర్తో పాటు కేవలం మ్యూజిక్తోనే సినిమా కాన్సెప్ట్ తెలియజేసే విధంగా సాగే థీమ్ సాంగ్ అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం' అని తెలిపారు.
ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్, ఎడిటింగ్: తమ్మిరాజు, ఆర్ట్: నిఖిల్ హాసన్, డైలాగ్స్: మిర్చి కిరణ్, లిరిక్స్: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, రోల్రైడా, కొరియోగ్రఫి: ప్రేమ్ రక్షిత్, స్టంట్స్: రియల్ సతీష్, ప్రొడక్షన్ కంట్రోలర్: కె. రవి కుమార్, కో - ప్రొడ్యూసర్: విజరు ధరణ్ దాట్ల, కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె.వి.గుహన్.