Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్ తేజ్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం 'గని'. రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. సయీ మంజ్రేకర్ కథానాయిక. లాక్డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ, 'కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల వల్ల ఆగిన మా 'గని' సినిమా చిత్రీకరణను ఇటీవలే మళ్లీ రీస్టార్ట్ చేశాం. ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో క్లైమాక్స్ సహా భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్ చిత్రమిది. హాలీవుడ్ చిత్రం 'టైటాన్స్', బాలీవుడ్లో 'సుల్తాన్' వంటి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఆధ్వర్యంలో భారీ సెట్స్లో ఈ యాక్షన్ పార్ట్ చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్కి సంబంధించిన ప్రకటన చేస్తాం' అని తెలిపారు.