Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ అధ్యాయాన్ని సృష్టించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి దర్శకరత్న దాసరి నారాయణరావు. త్వరలోనే 'దర్శకరత్న' పేరుతో ఆయన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇమేజ్ ఫిల్మ్స్ పతాకంపై ధవళ సత్యం దర్శకత్వంలో నిర్మాత తాడివాక రమేష్ నాయుడు ఈ బయోపిక్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత తాటివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ, 'నా గురువు, దైవం.. దర్శకరత్న దాసరి పేరిట ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టీవీ నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పిస్తున్నాం. అలాగే దాసరికి అత్యంత సన్నిహితులు, దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో 'దర్శకరత్న' పేరుతో దాసరి బయోపిక్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ధవళ సత్యం గారు ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారు. స్క్రిప్ట్ అత్యద్భుతంగా వచ్చింది. ఓ ప్రముఖ హీరో ఇందులో దాసరిగా నటించనున్నారు. పూర్తి వివరాలు అతి త్వరలో ప్రకటిస్తాం' అని తెలిపారు.