Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి కుంచల్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఎస్.కె'.
భారతి క్రియేషన్స్, కథెరిన్ ఫిల్మ్ వర్క్స్, మౌనిక ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రసాద్ ల్యాబ్లో ప్రారంభమైంది. సర్దార్ సుర్జీత్ సింగ్ నిర్మాత. సీనియర్ నటుడు పథ్వీ కుమార్తె శ్రీలు ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ చిత్ర ముహూర్తపు షాట్కు హీరో, దర్శకుడు చిరంజీవి కుమార్తె క్లాప్ నివ్వగా, నిర్మాత సర్దార్ సుర్జీత్ సింగ్ దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు.
ఈ సందర్భంగా హీరో, దర్శకుడు చిరంజీవి కుంచల్ మాట్లాడుతూ, 'పక్కా కమర్షియల్ హంగులతో కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. నా మొదటి సినిమా 'జీఎఫ్' విడుదలకు సిద్థంగా ఉండగానే, మరో సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది' అని చెప్పారు. '30 రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూనే ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. పథ్వీ కీలక పాత్రలో కనిపిస్తారు' అని నిర్మాత సర్దార్ సుర్జీత్ సింగ్ తెలిపారు. కథానాయిక శ్రీలు మాట్లాడుతూ, 'అద్భుతమైన కథ ఇది. ఈ సినిమాకి కథ, స్క్రీన్ప్లే ప్రధాన బలం. ఇటువంటి మంచి చిత్రంతో హీరోయిన్గా పరిచయం కావడం హ్యాపీగా ఉంది' అని అన్నారు. గడ్డం నవీన్, అభిరామ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వలి, మ్యూజిక్ :శ్రీ వెంకట్, టీమ్: నరేంద్ర, శ్రీకష్ణ, ఎస్.కష్ణ.