Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో, ఉన్నత స్థానాల్లో పని చేసిన కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం 'క్షీరసాగర మథనం'. ఈ సినిమాకి సాఫ్ట్ వేర్ ఇంజనీరైన అనిల్ పంగులూరి దర్శకత్వం వహించడం మరో విశేషం.
మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందిన ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, బ్రహ్మాజీ తనయుడు సంజరు కుమార్ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్గా, ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడుగా కనిపించబోతున్నారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ,'శేఖర్ కమ్ముల, దేవా కట్టా, మధుర శ్రీధర్ రెడ్డి వంటి సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చిన దర్శకులను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాం. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టు 6న థియేటర్లలో మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు. చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్, సంగీతం: అజరు అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహనిర్మాత: మురళీకష్ణ దబ్బుగుడి.