Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి టైటిల్ పాత్రధారిగా, రామ్చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.
ఈ సందర్బంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను జూలై 31 నాటికి పూర్తి చేశాం. రెండు పాటలను మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ఈనెల 20 నుంచి చిరంజీవి, చరణ్పై ఓ సాంగ్ను, అలాగే చరణ్, పూజా హెగ్డేపై మరో సాంగ్ను చిత్రీకరిస్తాం. దీంతో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఏకధాటిగా జరుగుతున్నాయి. ఇందులో చిరంజీవి పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే సిద్ధ అనే కీలక పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను కమర్షియల్ యాంగిల్లో ప్రేక్షకాభిమానులు మెచ్చేలా తెరకెక్కించడంలో డైరెక్టర్ కొరటాల శివ దిట్ట. తనదైన శైలిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరంజీవి నుంచి ఆయన అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఇప్పటికే విడుదలైన 'లాహే లాహే..' సాంగ్, టీజర్కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. వాటిని మించేలా సినిమా ఉంటుంది' అని తెలిపింది.