Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం 'శేఖర్'. (మ్యాన్ విత్ ద స్కార్ అనేది ఉపశీర్షిక). లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. బుధవారం అరకులో తాజా షెడ్యూల్ మొదలైంది.
ఈ సందర్భంగా దర్శకుడు లలిత్ మాట్లాడుతూ, 'కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణకు విరామం వచ్చింది. బుధవారం అరకులో చిత్రీకరణని పునః ప్రారంభించాం. హీరో రాజశేఖర్తో పాటు హీరోయిన్ అను సితార, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి ఈ షెడ్యూల్లో ప్లాన్ చేశాం. రాజశేఖర్ సరసన మరో కథానాయికగా 'జార్జ్ రెడ్డి' ఫేమ్ ముస్కాన్ కుబ్ చాందిని నటిస్తున్నారు' అని తెలిపారు. 'రాజశేఖర్ 91వ చిత్రమిది. అరకులో జరిపే షెడ్యూల్తో 75 శాతం సినిమా పూర్తవుతుంది. దాదాపు 20 రోజుల పాటు అరకులో చిత్రీకరణ చేస్తాం. ఆ తర్వాత హైదరాబాద్లో ఐదు రోజులు, తర్వాత శ్రీశైలం లేదా నాగార్జున సాగర్లో వారం రోజుల షెడ్యూల్ని ప్లాన్ చేశాం' అని నిర్మాతలు చెప్పారు.
ఈ చిత్రానికి కళ: దత్తాత్రేయ, రైటర్: లక్ష్మీ భూపాల, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని, సంగీతం: అనూప్ రూబెన్స్.