Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్, సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'మౌనం'. (పవర్ ఆఫ్ సైలెన్స్ అనేది ట్యాగ్ లైన్). ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో 'మల్లెపువ్వు' ఫేమ్ మురళి, 'వరుడు' ఫేమ్ భానుశ్రీ జంటగా నటించారు.
ఎమ్.ఎమ్.శ్రీలేఖ సంగీతం ముఖ్య ఆకర్షణగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ను దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించి, మణిరత్నం 'మౌనరాగం' తరహాలో రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్, సంధ్య రవి మాట్లాడుతూ,''మౌనం'' కూడా కొన్ని సందర్భాల్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో చాలా సెన్సిబిల్గా చూపించే చిత్రమిది. ఈనెలాఖరున లేదా సెప్టెంబర్ ఫస్ట్హాఫ్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మా సినిమా ట్రైలర్ని విడుదల చేసి, అభినందించిన తమ్మారెడ్డిగారికి ప్రత్యేక కతజ్ఞతలు' అని చెప్పారు. ఐశ్వర్య అడ్డాల, 'శివ' ఫేమ్ చిన్నా, జీవా, ధనరాజ్, శేషు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: అనిల్, స్క్రీన్ప్లే-ఎడిటింగ్: శివ శర్వాణి.