Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. నిధి అగర్వాల్ నాయిక. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్పై ఎ.ఎం.రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రచార చిత్రాన్ని ఇటీవల చిత్ర బృందం విడుదల చేసింది. పంచమి అనే పాత్రలో ఆమె వెండితెరపై మెరవబోతోంది.
''కష్ణ పక్ష పంచమి వెన్నెల వన్నెలవా..శుక్ల పక్ష పంచమి నెలవంక వయ్యారానివా? ఓ అందాల పంచమి.. ఎవరివే నీవెవరివే? అంటూ ఆమెను వర్ణించడం విశేషం. ప్రచార చిత్రంలోని నత్య భంగిమలో అందమైన ఆమె రూపంను వీక్షిస్తే ఎంతో అందంగానూ, అపూర్వంగా ఉంది. నేటి తరం దర్శకుల్లో ఇంద్రజాలికుడు లాంటి దర్శకుడు క్రిష్ తన ట్రేడ్మార్క్ అంశాలతో ఈ చిత్రాన్ని అపూర్వంగా తీర్చిదిద్దుతున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్గా ఈ సినిమా రూపొందుతోంది. ఇది భారతీయ సినిమాల్లో ఇప్పటిదాకా చెప్పని కథ. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభవాన్ని ఇస్తుంది.ఏ విషయంలోనూ రాజీపడని ఉన్నతస్థాయి నిర్మాణ విలువలతో, నూటయాభై కోట్లకు పైగా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో నిర్మాణమవుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు జరిపిన షూటింగ్తో యాభై శాతం పూర్తయింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది' అని నిర్మాత ఎ.దయాకర్రావు తెలిపారు.